Sunday, May 19, 2024

ఇంటి దగ్గరకే భద్రాద్రి సీతారాముల‌వారి కల్యాణ తలంబ్రాలు

spot_img

శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో జ‌రిగే సీతారాముల కల్యాణోత్సవానికి సంబంధించిన తలంబ్రాలను భక్తులకు అందజేయాలని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (RTC) యాజమాన్యం నిర్ణయించింది. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి కల్యాణ తలంబ్రాలు భక్తుల ఇళ్లకు చేరవేసే పుణ్యకార్యానికి శ్రీకారం చుట్టారు. ఈ తలంబ్రాలు కావాలనుకొనే భక్తులు టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవం తర్వాత తలంబ్రాలను భక్తులకు హోం డెలివరీ చేయనున్నారు.

భద్రాచలంలో ఏప్రిల్‌ 17న అంగరంగ వైభవంగా జరిగే శ్రీరామనవమి వేడుకలకు వెళ్లలేని భక్తులు ఈ సేవల్ని ఉపయోగించుకోవచ్చు. రాష్ట్రంలోని అన్ని టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో తలంబ్రాలను బుక్‌ చేసుకొనే వెసులుబాటు కల్పించారు. టీఎస్‌ఆర్టీసీ మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌లు కూడా భక్తుల దగ్గర నేరుగా ఆర్డర్లను స్వీకరిస్తారు. తలంబ్రాల సేవను పొందాలనుకునే భక్తులు టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్‌ నంబర్లు 040-23450033, 040-69440000, 040-69440069ను సంప్రదించాలని అధికారులు సూచించారు.

ఇది కూడా చదవండి: బీజేపీ వాళ్లకు వస్తదో,రాదో..హ‌నుమాన్ చాలీసాను 2 నిమిషాల్లో చ‌దివేస్తా

హైదరాబాద్‌లోని బస్‌ భవన్‌లో ఇవాళ(సోమవారం) భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాల బుకింగ్‌ పోస్టర్‌ను టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ఆవిష్కరించారు. ఈసందర్భంగా తలంబ్రాల బుకింగ్‌ను ప్రారంభించారు. ఎంతో నిష్ఠతో ధాన్యాన్ని గోటితో ఒలిచి తీసిన కోటి బియ్యం గింజలను తలంబ్రాలుగా ఎన్నోఏళ్లుగా రాములోరి కల్యాణంలో ఉపయోగిస్తున్నారు. విశిష్టమైన ఈ తలంబ్రాలను భక్తుల ఇంటికి చేర్చాలని రెండేళ్ల క్రితమే టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ ప్రయత్నానికి భక్తుల నుంచి విశేష స్పందన వచ్చింది. సంస్థపై ఉన్న విశ్వాసంతో భక్తులు భారీ సంఖ్యలో తలంబ్రాలను బుక్‌ చేసుకుంటున్నారు. 2022లో దాదాపు 89 వేల మంది భక్తులు తలంబ్రాలను బుక్ చేసుకోగా.. గతేడాది 1.17 లక్షల మంది భక్తులకు తలంబ్రాలను అందించామని తెలిపారు ఎండీ వీసీ సజ్జనార్‌.

Latest News

More Articles