Monday, May 6, 2024

బీజేపీ వాళ్లకు వస్తదో,రాదో..హ‌నుమాన్ చాలీసాను 2 నిమిషాల్లో చ‌దివేస్తా

spot_img

రాష్ట్రంలోని బీజేపీ నేత‌ల‌ను తీవ్రంగా విమర్శించారు బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు. వీళ్లే భ‌క్తులు అన్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. మ‌నం కూడా దేవుళ్ల‌ను పూజిస్తామ‌ని, తాను రెండు నిమిషాల్లోనే హ‌నుమాన్ చాలీసా చ‌దివేస్తాన‌ని హ‌రీశ్‌రావు తెలిపారు. వ‌రంగ‌ల్ పార్ల‌మెంట్ విస్తృత స్థాయి స‌మావేశంలో హ‌రీశ్‌రావు పాల్గొని మాట్లాడారు.

ప‌దేండ్ల బీజేపీ పాల‌న‌లో తెలంగాణ‌కు చేసిందేమీ లేదు. బీజేపీ మాట వింటే జోడి.. విన‌క‌పోతే తెల్లారీ ఈడీ.. ఇది ఇవాళ ఈ దేశంలో రాజ‌కీయ ప‌రిస్థితి. విదేశాల్లో న‌ల్ల‌ధ‌నం తెస్తామ‌ని, ఒక్కోక్క‌రి అకౌంట్‌లో 15 ల‌క్ష‌లు వేస్తామ‌న్నారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామ‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఈ ప‌దేండ్ల‌లో ఒక కోటి ఉద్యోగాలు కూడా ఇవ్వ‌కుండా నిరుద్యోగుల‌ను మోసం చేశారు. న‌ల్ల‌చ‌ట్టాలు తెచ్చి రైతులను పొట్ట‌న పెట్టుకుంది బీజేపీ ప్ర‌భుత్వం. పెట్రోల్, డిజీల్ ధ‌ర‌లు పెంచారు. బీజేపీ పాల‌న‌లో ఈ దేశంలో ఆక‌లి, పేద‌రికం, నిరుద్యోగం పెరిగింది. బీజేపీ పాల‌న‌లో సీబీఐ, ఈడీ కేసులు మాత్రం పెరిగాయన్నారు హ‌రీశ్‌రావు.

బీజేపీ వాళ్లు ఏమ‌న్న అంటే రామాల‌యం అంటారు. రాముడిని అంద‌రం మొక్కుతాం. మ‌నం కూడా హ‌నుమాన్ చాలీసా చ‌దువుతాం. బీజేపీ వాళ్ళకు వ‌స్తదో.. రాదో తెలవదు కానీ.. తాను హ‌నుమాన్ చాలీసా రెండు నిమిషాల్లో చ‌దువుతాను. హనుమాన్ చాలీసా చ‌ద‌వ‌నిదే, పూజ చేయ‌నిదే బ‌య‌ట‌కు వెళ్లం. దేవుడు అంద‌రివాడు. బీజేపోళ్ల‌కు మాత్ర‌మే దేవుడు అన్నార‌ని అనుకుంటారు. అద్భుత‌మైన యాదాద్రి క‌ట్టారు కేసీఆర్. మ‌నం కూడా అక్షింత‌లు పంచిన‌ట్టు.. ఇంటికో యాదాద్రి ల‌డ్డూ పంచి రాజ‌కీయాలు చేయ‌లేదు. రాజ‌కీయాల‌కు దేవుళ్ల‌ను వాడుకోలేదు. బీజేపీ నాయ‌కులు చేసింది ఏం లేదు కాబ‌ట్టి మ‌తం పేరిట రాజ‌కీయాల‌ను చేస్తున్నారు. జాతీయ పార్టీల‌కు గులాం గిరి చేసేవాళ్లు కావాల్నా.. తెలంగాణ గ‌ళం వినిపించే వాళ్లు కావాల్నా ఆలోచించాలని వ‌రంగ‌ల్ ప్ర‌జ‌ల‌ను కోరారు హ‌రీశ్‌రావు.

ఇది కూడా చదవండి: ఐదేండ్లు రేవంత్ రెడ్డినే పరిపాలించి, హామీలు అమలు చేయాలి

Latest News

More Articles