Saturday, May 18, 2024

పెళ్లి రూమర్స్ పై సాయి పల్లవి ట్వీట్

spot_img

హైదరాబాద్: నటి సాయి పల్లవి పెండ్లి జరిగిదంటూ.. ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దర్శకుడు రాజ్‌కుమార్‌ పెరియస్వామిని సాయిపల్లవి పెళ్లి చేసుకున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఆ వార్తలో ఎటువంటి వాస్తవం లేదని తాజాగా సాయిపల్లవి ట్వీట్(ఎక్స్) చేసింది.

Also Read.. ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీం నోటీసులు

రాజ్‌కుమార్‌ పెరియస్వామి  డైరెక్షన్ లో నటుడు శివ కార్తికేయన్‌తో కలిసి చేస్తున్న ఓ సినిమా పూజా భాగంగా చిత్రబృందంతో పాటు మెడలో దండలు వేసుకున్న ఫోటోలను కావాలని ఎవరో క్రాప్ చేసి వైరల్ చేస్తున్నారని స్పష్టతనిచ్చారు. ‘‘నిజం చెప్పాలంటే, నేను రూమర్‌లను పట్టించుకోను. కానీ అది కుటుంబ సభ్యులైన స్నేహితులతో ముడిపడి ఉన్నందున స్పందించాల్సి వచ్చింది.’’ అని సాయిపల్లవి తన పోస్ట్ లో రాసుకొచ్చింది.

Latest News

More Articles