Sunday, May 5, 2024

అమీర్ పేట్ కు నిధుల వరద

spot_img

అమీర్ పేట్ డివిజన్ లో పర్యటించి 1.21 కోట్ల రూపాయల విలువైన 7 అభివృద్ధి పనులను ప్రారంభించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కుమ్మరి బస్తీలో 10 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న CC రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు తలసాని. ఇక వరుసగా.. ఆమోఘ హోటల్ వద్ద 6 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న వాటర్ పైప్ లైన్ పనులు ప్రారంభం. గాయత్రి నగర్ లో 10 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీవరేజ్ లైన్ పనులు ప్రారంభం.

SR నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద 33 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న వాటర్ లైన్ పనులు ప్రారంభం. B టైప్ క్వార్టర్స్ వద్ద 23 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న వాటర్ లైన్ పనులు ప్రారంభం. B టైప్ క్వార్టర్స్ వద్ద 34 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న CC రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం. శివబాగ్ కాలనీలో 5.50 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీవరేజ్ లైన్ పనులను ప్రారంబించిన మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్.

Latest News

More Articles