హీరో సిద్ధార్థ్ హీరోగా నటించిన తాజా చిత్రం చిత్తా. నిమిషా సజయన్ కథానాయికగా నటించింది. ‘సేతుపతి’ సినిమా ఫేమ్ అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 28న తమిళంలో విడుదలై మంచి విజయం సాధించింది. అయితే ఇదే సినిమాను ‘చిన్నా’ అనే పేరుతో తెలుగులో అక్టోబర్ 06న విడుదల చేయగా.. ఇక్కడ కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక సిద్దూ కెరీర్లోనే ఇది బెస్ట్ సినిమా అన్నారు విమర్శకులు.
Movie of the Year #Chinna is Streaming now on Disney Plus Hotstar pic.twitter.com/ecB5RoU7SW
— Movies4u Official (@Movies4u_Officl) November 28, 2023
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ సినిమా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ చిత్రాన్ని రెడ్ జెయింట్ మూవీస్, ఈటాకీ ఎంటర్టైనమెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. బాబాయికి.. చిన్నారికి మధ్య జరిగే కథతో ఈ సినిమా సాగుతుంది. సడన్గా కూతురు కిడ్నాప్ అవ్వడంతో.. కూతురు కోసం సిద్ధార్థ్ చేసే పోరాటమే ఈ సినిమా.
Read also: హాలీవుడ్, బాలీవుడ్పై మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు