Sunday, May 19, 2024

డిసెంబర్ 12నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు

spot_img

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో డిసెంబరు 12 నుంచి 2024 జ‌న‌వ‌రి 5వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగనున్నాయని టీటీడీ అధికారులు తెలిపారు. సాధారణంగా ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందుగా శ్రీవారి సన్నిధిలో ఈ అధ్యయనోత్సవం ప్రారంభం అవుతుందని చెప్పారు.

ఈ సందర్భంగా స్వామివారి ప్రాశస్త్యంపై 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను శ్రీవైష్ణవ జీయంగార్లు గోష్ఠిగానం చేస్తారు. ఆళ్వార్‌ దివ్యప్రబంధంలోని 4 వేల పాశురాలను 25 రోజుల పాటు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీవైష్ణవులు పారాయణం చేయనున్నట్లు తెలిపారు.

తొలి 11 రోజులను పగల్‌పత్తు అని, మిగిలిన 10 రోజులను రాపత్తు అని వ్యవహరిస్తారు. 22వ రోజున కణ్ణినున్‌ శిరుత్తాంబు, 23వ రోజున రామానుజ నూట్రందాది, 24వ రోజున శ్రీవరాహస్వామివారి శాత్తుమోర, 25వ రోజున అధ్యయనోత్సవాలు పూర్తికానున్నాయి.

ఇది కూడా చదవండి:అయోధ్యలో రాములవారి ప్రతిష్టాపనతో హిందువుల కల నిజం కాబోతోంది

Latest News

More Articles