మాదాపూర్ డ్రగ్స్ కేసులో యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా.. ఈ కేసులో నిందితులుగా ఉండి, పరారీలో ఉన్న కలహర్ రెడ్డి, హిటాచి సాయి, స్నార్ట్ పబ్ ఓనర్ సూర్య ఈ రోజు పోలీసులు ఎదుట లొంగిపోనున్నారు. డ్రగ్స్ కేసు తీవ్రతరం కావడంతో ఈ ముగ్గురు నిందితులు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. దాంతో వారిని పోలీసుల ఎదుట లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది. డ్రగ్స్ కేసులో A13గా కలహర్ రెడ్డి, A18గా సూర్య, A22గా హిటాచి సాయి ఉన్నారు.
Read Also: ‘చంద్రుడు జైల్లో హ్యాపీగా ఉన్నారు’.. చంద్రబాబు అరెస్ట్పై అసదుద్దీన్ హాట్ కామెంట్స్
ఇప్పటి వరకు ఈ కేసులో ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. మరికొంత మంది డ్రగ్స్ కన్జ్యూమర్స్కు నోటీసులు జారీ చేశారు. సినీ ఇండస్ట్రీలో వివిధ పేర్లతో డ్రగ్స్ సప్లై జరుగుతున్నట్లు కనిపెట్టారు. స్క్రిప్ట్, రైటర్, షల్ వి మీట్ .. అనే కోడ్ లాంగ్వేజ్తో సరఫరా చేస్తున్నారని నార్కోటిక్ పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే హీరో నవదీప్ను నార్కోటిక్ బ్యూరో అధికారులు ఆరు గంటల పాటు విచారించారు. విచారణలో నవదీప్ 40 మంది డ్రగ్ కన్జ్యూమర్స్ పేర్లను చెప్పినట్లు సమాచారం.
Read Also: పిల్లి అనుకొని చేరదీస్తే అది పులి అయింది.. వైరల్ వీడియో