కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: కాగజ్ నగర్ అటవీశాఖ డివిజన్ లోని దరిగాం అటవీ ప్రాంతంలో రెండు పులులు మృతి చెందిన ఘటనలో విధుల్లో అలసత్వం వహించిన అటవీశాఖ అధికారులపై ఉన్నతాధికారుల సీరియస్ అయ్యారు. నలుగురు అటవీశాఖ అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు. కాగజ్ నగర్ అటవీ శాఖ డివిజన్ కు చెందిన ఎఫ్ డిఓ వేణుబాబు, ఎఫ్ఆర్ఓ వేణుగోపాల్, ఎఫ్ఎస్ఓ పోశెట్టి, ఎఫ్ బిఓ శ్రీకాంత్ లను సస్పెండ్ చేస్తూ అటవీశాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
Also Read.. జయశంకర్ సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి