Wednesday, May 1, 2024

జయశంకర్ సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి

spot_img

ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్ విగ్రహం ధ్వంసం చేసిన ఘటనను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్రంగా ఖండించారు. తెలంగాణ సమాజం ఎంతగానే గౌరవించే వ్యక్తి విగ్రహాన్ని ధ్వంసం చేయడం దారుణమని అభిప్రాయపడ్డారు. ఇలాంటి హేయమైన చర్యకు పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను ట్విట్టర్‌ ద్వారా డిమాండ్‌ చేశారు.

హైదరాబాద్‌ శివారులోని శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్‌ కాలనీలో ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. పోలీసుల ముందే ఎల్లమ్మబండ మెయిన్‌ రోడ్డులోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. మహవీర్‌ కాలనీకి చెందిన గోవింద్‌ అనే వ్యక్తి మద్యం మత్తులో ఇవాళ(మంగళవారం) ఉదయం అల్విన్‌ కాలనీ చౌరస్తాకు వచ్చాడు. అక్కడే ఉన్న ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్రహాన్ని కింద పడేశాడు. ఆ తర్వాత ఓ రాయితో విగ్రహాన్ని ధ్వంసం చేశాడు.

ఇది కూడా చదవండి: దళిత బంధును కాంగ్రెస్ కొనసాగిస్తుందా? లేదా? చెప్పాలి

Latest News

More Articles