Sunday, May 19, 2024

డ‌బ్ల్యూటీసీలో ఐదో ర్యాంక్ కు పడిపోయిన టీమిండియా

spot_img

సొంత‌గ‌డ్డ‌పై ఉప్ప‌ల్ స్టేడియంలో తొలి టెస్టు ఓట‌మి బాధ‌లో ఉన్న‌ భార‌త జ‌ట్టు పెద్ద షాక్ త‌గిలింది. ప్ర‌పంచ టెస్టు చాంపియ‌న్‌ షిప్(WTC 2023-25) పాయింట్ల ప‌ట్టిక‌లో ఐదో స్థానానికి ప‌డిపోయింది. గ‌త ఐదు టెస్టుల్లో రెండింటిలో మాత్ర‌మే గెలిచిన రోహిత్ సేన 43.33 విజ‌యాల శాతంతో బంగ్లాదేశ్ కంటే వెన‌క‌బ‌డిపోయింది.

స్వ‌దేశంలో పాకిస్థాన్‌ను వైట్‌వాష్ చేసి.. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ స‌మం చేసుకున్న ఆస్ట్రేలియా టాప్ ర్యాంక్‌లో ఉంది. ద‌క్షిణాఫ్రికా 50 శాతంతో రెండో స్థానంలో, న్యూజిలాండ్ జ‌ట్టు 50 శాతంతో మూడో స్థానంలో నిలిచాయి. కివీస్ గ‌డ్డ‌పై చారిత్రాత్మ‌క విజ‌యం సాధించిన‌ బంగ్లాదేశ్ నాలుగో ప్లేస్ ద‌క్కించుకుంది.

ఇది కూడా చదవండి: డివైడర్‌పై దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

Latest News

More Articles