Saturday, May 11, 2024

మూడో టీ20 మ్యాచ్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

spot_img

టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య ఇవాళ(శనివారం) చివరిదైన మూడో టీ20 మ్యాచ్ రాజ్ కోట్ లో జరగనుంది. సిరీస్ ఫలితం తేల్చే ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మూడు వన్డేల సిరీస్ లో రెండు జట్లు చెరో మ్యాచ్ గెలవడంలో సిరీస్ 1-1తో సమమైంది. దీంతో ఈ మ్యాచ్ లో విజయం సాధించేందుకు రెండు జట్లు దృష్టి సారించాయి. మ్యాచ్ కోసం టీమిండియాలో ఎలాంటి మార్పులు లేవని కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపారు. శ్రీలంక జట్టులో ఒక మార్పు జరిగింది. భానుక రాజపక్స స్థానంలో ఆవిష్క ఫెర్నాండో తుది జట్టులోకి వచ్చాడు.

టీమిండియా జట్టు:
హార్దిక్ పాండ్యా (కెప్టెన్), ఇషాన్ కిషన్, శుభ్ మాన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, అక్షర్ పటేల్, శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్, యజువేంద్ర చహల్.

శ్రీలంక జట్టు:
దసున్ షనక (కెప్టెన్), పత్తుమ్ నిస్సాంక, కుశాల్ మెండిస్, ఆవిష్క ఫెర్నాండో, ధనంజయ డిసిల్వా, చరిత్ అసలంక, వనిందు హసరంగ, చామిక కరుణరత్నే, మహీశ్ తీక్షణ, కసున్ రజిత, దిల్షాన్ మధుశంక.

Latest News

More Articles