నేడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ షురూ కానుంది. దీనికోసం అధికారులు సర్వం సిద్ధంగా ఉంచారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 35,655పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలలో నమోదైన ఓట్లను లెక్కించాల్సి ఉంటుంది. భద్రాచలం, అశ్వారావుపేట, చార్మినార్ నియోజకవర్గాల్లో లెక్కింపు రౌండ్లు తక్కువగా ఉండటంతో వీటిలో ఏదొక స్థానం నుంచి మొదటి ఫలితం వెలువడవచ్చని అంచనా. చార్మినార్ లో పోలైన ఓట్లు చాలా తక్కువగా ఉండటంతో మిగిలిన రెండింటి కంటే దాని ఫలితమే మొదట వస్తుందని భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ‘సీఆర్పీఎఫ్’కు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ బాధ్యతలు