ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉన్న క్రీడల్లో ఒకటైన క్రికెట్ ను ఒలింపిక్స్కు చేర్చేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఇదే జరిగితే దాదాపు 128 ఏళ్ల తర్వాత క్రికెట్ను మళ్లీ చూడొచ్చు. అన్ని అనుకున్నట్లు జరిగితే 2028 లాస్ ఏంజిల్స్లో జరిగే ఒలింపిక్స్లో టీ20 క్రికెట్ మ్యాచ్ లను చూసేయొచ్చు.
Also Read.. బ్యాటింగ్లో అదరగొట్టిన ఇంగ్లండ్
క్రికెట్తో పాటు ఫ్లాగ్ ఫుట్బాల్, బేస్బాల్, సాఫ్ట్బాల్ సైతం పరిశీలన జాబితాలో ఉన్నాయి. ఈ నెల 15 నుంచి ముంబయిలో జరుగనున్న ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ (IOC) సమావేశంలో నిర్ణయం తీసుకోన్నారు. ఇదిలా ఉండగా.. చాలా సంవత్సరాల తర్వాత ఆసియా గేమ్స్లోకి క్రికెట్ను ప్రవేశపెట్టారు. ఆసియా గేమ్స్లో పురుషుల, మహిళల క్రికెట్లో రెండు బంగారు పతకాలను భారత్ సాధించింది.