అహ్మదాబాద్: గుజరాత్లోని అహ్మదాబాద్ స్టేడియంలో జరుగుతున్న భారత్, ఆస్ట్రేలియా కు అంతరాయం కలిగింది. పాలస్తీనాకు మద్దతుగా ఒక వ్యక్తి సెక్యూరిటీ నిబంధనలు ఉల్లంఘించి పిచ్లోకి దూసుకెళ్లాడు. భారత ప్లేయర్ కోహ్లీని హగ్ చేసుకునేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది.
ఆ వ్యక్తి ధరించిన టీ షర్ట్ ముందు వైపు ‘పాలస్తీనాపై బాంబింగ్ ఆపండి’ అని వెనుక ‘ఫ్రీ పాలస్తీనా’ అని రాసి ఉంది. అలాగే పాలస్తీనా జెండా రంగులను పోలిన మాస్క్ను అతడు ధరించాడు. పాలస్తీనాలోని గాజాపై ఇజ్రాయెల్ బాంబు దాడులకు వ్యతిరేకంగా ఈ సంఘటనకు పాల్పడ్డాడు.
భద్రతను ఉల్లంఘించి పిచ్ వద్దకు వచ్చిన ఆ వ్యక్తిని స్టేడియం సిబ్బంది వెంటనే అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
😭 https://t.co/huO0AUCeV6 pic.twitter.com/MsjYOFCXoA
— Ayush (@KohliAdorer) November 19, 2023