రంగారెడ్డి : కాంగ్రెస్, బీజేపీని నమ్మితే మోసపోతామని మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా ఆర్కేపురం డివిజన్ హరిపురి కాలనీకి చెందిన వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు మంత్రి సబితాఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. పదేళ్ల కాలంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ప్రజలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ని గెలిపిస్తేనే బతుకులు బాగుంటాయన్నారు. నియోజకవర్గంలో నిరంతర అభివృద్ధి కొనసాగాలంటే 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటెసి తనను గెలిపించాలని కోరారు. మరింత అభివృద్ధి కోసం మరోసారి తనను ఆశీర్వదించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.