Saturday, May 18, 2024

దారుణం.. రూ.10 కోసం యువకుడిని స్తంభానికి కట్టేసి కొట్టడంతో..!!

spot_img

మనిషి జీవితం రూ.10 లేదా రూ. 20 కంటే తక్కువగా ఉంటుందని ఊహించగలరా? ఢిల్లీలోని నందనగరి హత్యోదంతం తెలిసిన తర్వాత మానవత్వం చచ్చిపోయిందా అనిపిస్తుంది. నార్త్ ఈస్ట్ ఢిల్లీలోని నందనగరి పోలీస్ స్టేషన్ పరిధిలోని సుందర్ నగ్రిలో ఓ యువకుడిని స్తంభానికి కట్టేసి కొట్టి చంపారు. రూ.10 దొంగలించాడన్న అనుమానంతో బాధితుడిని స్తంభానికి కట్టేసిన యువకులు తీవ్రంగా చావబాదరు. దెబ్బలు తట్టుకోలేక ఆ యువకుడు అక్కడిక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనకు సంబంధించి నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడు సుందర్‌ నగరి నివాసి ఇసార్‌గా గుర్తించారు.

ఈశాన్య ఢిల్లీలో కొంత మంది దొంగ అనే అనుమానంతో 26 ఏళ్ల వ్యక్తిని స్తంభానికి కట్టి, కర్రలతో కొట్టి చంపారని పోలీసులు తెలిపారు. మంగళవారం రాత్రి 10:46 గంటలకు ఈ ఘటనకు సంబంధించి తమకు సమాచారం అందిందన్నారు. మృతుడి తండ్రి ఈ ఘటనకు సంబంధించి తమకు సమాచారం అందించారన్నారని పోలీసులు తెలిపారు. మృతుడి తండ్రి అబ్దుల్ పండ్ల విక్రేత. సాయంత్రం 6.30గంటలకు తాను ఇంటికి వచ్చి చూసేసరికి తన కుమారుడు కనిపించలేదని..చుట్టు పక్కల గాలిస్తుండగా స్తంభానికి కట్టేసి ఉన్నట్లు గుర్తించినట్లు పోలీసులకు తెలిపాడు. తన కుమారుడిని గాయాలతో చూసిన అబ్దుల్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అప్పటికే ఇసార్ మరణించినట్లు గుర్తించారు.

మరిన్ని వార్తలు..

Latest News

More Articles