Sunday, May 19, 2024

కారు టైరు పేలి ముగ్గురి మృతి

spot_img

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చనిపోగా..మరో 8మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇవాళ(మంగళవారం) మధ్యాహ్నం తూర్పు గోదావరి జిల్లాలోని దేవరపల్లి మండల పరిధిలోని బంధపురం దగ్గర జాతీయ రహదారిపై ఓ కారు టైర్ పేలడంతో వేరే రూట్లో వెళ్లే కారును ఢీకొనడంతో స్పాట్ లోనే ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మందికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో అదే మార్గంలో వెళ్తోన్న గోపాలపురం ఎమ్మెల్యే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని దేవరపల్లి, గోపాలపురం, కొవ్వూరు ఆస్పత్రులకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చదవండి: మేడారం బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం లేదు

Latest News

More Articles