Monday, May 6, 2024

సచిన్ బిడ్డకు తల్లి కాబోతున్న సీమా హైదర్

spot_img

సీమా హైదర్ మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈసారి సీమా తమకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది(2024) సచిన్ బిడ్డకు సీమా హైదర్ తల్లి కాబోతోంది. పబ్జీ గేమ్‌ ద్వారా పరిచయమైన సచిన్‌ కోసం సీమా తన నలుగురి పిల్లలతో అతి కష్టంమీద పాక్ నుంచి భారత్‌ లోకి అడుగుపెట్టి అందరి దృష్టిని ఆకర్షించింది. అక్రమంగా భారత్‌కు వచ్చిన ఆమె ఇప్పుడు ఓ సెలబ్రిటీ అయిపోయింది. సచిన్‌ని పెళ్లాడిన సీమా వైవాహిక జీవితాన్ని సాఫీగా కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే కొత్త ఏడాది శుభవార్త పంచుకుంది. తాను గర్భందాల్చినట్లు తెలిపింది. భర్త సచిన్‌ బిడ్డకు తల్లికాబోతున్నట్లు తెలిపింది  దీనికి సంబంధించి ఓ ప్రైవేట్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ శుభవార్త పంచుకుంది.

పాక్ జాతీయురాలైన 30 ఏళ్ల సీమా హైదర్.. ఉత్తరప్రదేశ్ కు చెందిన 22 ఏళ్ల సచిన్ మీనాతో పబ్జీ గేమ్ ద్వారా ప్రేమలో పడింది. అతడి కోసం నలుగురు పిల్లలతో సహా పాక్ సరిహద్దును దాటి గతేడాది భారత్ లోకి అక్రమంగా అడుగుపెట్టింది. ఆ తర్వాత సచిన్ మీనాను వివాహం చేసుకున్న సీమా.. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో నివాసముంటోంది.

ఇది కూడా చదవండి: రాజకీయ కక్షసాధింపు చర్యలు సరికావు..అభివృద్ధి చేయండి

Latest News

More Articles