Sunday, May 19, 2024

బీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు పలికిన టీఎమ్మార్పీఎస్

spot_img

రంగారెడ్డి: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు టీఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు నందిగామ నర్సింహ్మ. మంద కృష్ణ మాటలు మేము నమ్మమని, టీఎమ్మార్పీఎస్ బీఆర్ఎస్ పార్టీ కి సంపూర్ణ మద్దతు పలుకుతుందని స్పష్టం చేశారు. ఒట్ల కోసమే బీజేపీ మాదిగలను మోసం చేస్తుంది. గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న మోడి వర్గీకరణ ఎందుకు చేయలేదు.  10 రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు ఉండడంతో సడన్ గా మాదిగల పై కపట ప్రేమ పుట్టుకు వచ్చింది. మాదిగ ఓట్లు దండుకోడానికి‌ మోడి హైదరాబాద్ లో భారీ సభ నిర్వహించారు. మంద కృష్ణ మాదిగకు ఎరవేసాడని పేర్కొన్నారు.

Also Read.. ఈ గడ్డ మీద పుట్టిన బీఆర్ఎస్ కావాలా? ఢిల్లీలో పుట్టిన జాతీయ పార్టీలు కావాల్నా?

వర్గీకరణ చేస్తామంటూ హామీలు ఇచ్చాడు. మోడి మాటలు నమ్మే పరిస్థితిలో మాదిగలు లేరు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాదిగలకు సముచిత న్యాయం కల్పించారు. ముఖ్యమైన పదవుల్లో మాదిగలను కొనసాగించారు. ఉప ముఖ్యమంత్రి పదవితో‌ మొదలుకోని కీలక పదువులు ఇచ్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుంది. టీ ఎమ్మార్పీఎస్ బీఆర్ఎస్ పార్టీ కి‌ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. బీఆర్ఎస్ బలపరచిన అభ్యర్ధులను ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలిపించే బాధ్యత టీ ఎమ్మార్పీఎస్ తీసుకుంటుంది. బీఆర్ఎస్ గెలుపుతో మోడికి దిమ్మ తిరిగే సమాధానం డిసెంబర్ 3వ తారీఖున చెప్పబోతున్నట్లు చెప్పారు.

Latest News

More Articles