Friday, May 17, 2024

ఐడిబిఐ బ్యాంకులో 500జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ల దరఖాస్తుకు నేడే చివరి తేదీ.!

spot_img

ఐడీబిఐ బ్యాంక్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునే అభ్యర్థులకు ముఖ్యమైన అప్‌డేట్. ఐడీబీఐ బ్యాంక్ 12 ఫిబ్రవరి 2024 నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (PGDBF) కోర్సులో ప్రవేశానికి అర్హులైన, ఆసక్తిగల అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంపికైన అభ్యర్థుల కోర్సు పూర్తయిన తర్వాత బ్యాంక్‌లో జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు అపాయింట్‌మెంట్ అందించే ఈ రిక్రూట్‌మెంట్ (IDBI JAM రిక్రూట్‌మెంట్ 2024) దరఖాస్తు ప్రక్రియ ఈరోజు అంటే ఫిబ్రవరి 26వ తేదీ సోమవారంతో ముగియనుంది. ఇంకా దరఖాస్తు చేసుకోని ఆసక్తిగల అభ్యర్థులు చివరి క్షణాల కోసం వేచి ఉండకుండా వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది.

ఐడీబీఐ బ్యాంక్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ రిక్రూట్‌మెంట్ (IDBI JAM రిక్రూట్‌మెంట్ 2024) ప్రకటించిన 500 పోస్ట్‌లకు ఇంకా దరఖాస్తు చేసుకోని ఆసక్తిగల అభ్యర్థులు, దరఖాస్తు చేయడానికి బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్, idbibank.in ని సందర్శించిన తర్వాత కెరీర్ విభాగంలోకి వెళ్లాలి. అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన లింక్ లేదా సంబంధిత అప్లికేషన్ పేజీలో దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు చేస్తున్నప్పుడు, అభ్యర్థులు ఆన్‌లైన్ లో ఈ రిక్రూట్‌మెంట్ కోసం నిర్ణీత రుసుము 1000 చెల్లించాలి. అయితే, షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ) వికలాంగ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు ఫీజు కేవలం రూ.200 మాత్రమే ఫీజు చెల్లించవలసి ఉంటుందని,ఎవైనా తప్పులు ఉంటే సవరించుకునేందుకు ఈరోజే చివరి తేదీ.

ఇది కూడా చదవండి: ఆ కంపెనీలో డిప్యూటీ మేనేజర్‌ పోస్టులకు రిక్రూట్‌మెంట్..నెలకు రూ. 2 లక్షల జీతం.!

Latest News

More Articles