హైదరాబాద్: అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట ఘనంగా జరిగింది. ప్రధాని మోడీ చేతుల మీదుగా 12: 29 నిమిషాలకు శ్రీరాముడి బాల విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేశారు. ఈ కార్యక్రమానికి దేశంలోని ప్రముఖులు హాజరయ్యారు. శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించారు. ప్రస్తుతం మహేష్ విదేశీ పర్యటనలో ఉన్నారు.
Also Read.. 7,625 కోట్లు ఇచ్చేదెప్పుడు.. దిక్కుతోచని స్థితిలో 39 లక్షల మంది రైతులు
అయోధ్యలో రామ మందిరాన్ని గొప్పగా ప్రారంభించడం గర్వంగా ఉందని ట్వీట్(ఎక్స్) లో పేర్కొన్నారు. ఇది దేశ ఐక్యత, ఆధ్యాత్మికతకు శాశ్వతమైన చిహ్నంగా నిలుస్తుందన్నారు. ప్రస్తుతం ఆ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేశ్.. రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చెయ్యనున్నారు.
Amidst the echoes of history and the sanctity of faith, the grand opening of the Ram Mandir in Ayodhya heralds a timeless symbol of unity and spirituality. Extremely proud to witness history unfold! #AyodhyaRamMandir #JaiShreeRam 🙏
— Mahesh Babu (@urstrulyMahesh) January 22, 2024