కామారెడ్డి: ప్రచారం గడువు ముగియడంతో పైసలు పంచేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. కామారెడ్డిలో పిసిసి చీప్ రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు గూడెం శ్రీనివాస్ రెడ్డి ఆఫీసులో సుమారు 60 లక్షల వరకు నగదును విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిచ్చారు? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఏసీబీ అధికారులకు సమాచారం అందించారు. ఆ డబ్బును ఎన్నికల్లో క్యాంపెయినింగ్ లో భాగంగా ఇక్కడ ఉంచారని రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు గూడెం శ్రీనివాస్ రెడ్డి అంగీకరించినట్లు తెలుస్తోంది.