Wednesday, May 1, 2024

కాంగ్రెస్ ది బలుపు కాదు వాపే.. తెలంగాణలో గెలిచి నిలిచేది బీఆర్ఎస్ మాత్రమే

spot_img

హైదరాబాద్: తెలంగాణలో గెలిచి నిలిచేది బీఆర్ఎస్ మాత్రమేనని ప్రచార సరళి నిరూపించిందని మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ ది బలుపు కాదు వాపే నని విఫలమైన వారి సభలు రుజువు చేశాయన్నారు. కాంగ్రెస్ బీజేపీల నుంచి ఎంత మంది పొలిటికల్ టూరిస్టులు వచ్చినా కేసీఆర్ కే ప్రజలు బ్రహ్మ రథం పట్టారని పేర్కొన్నారు.

ఈ నెల 30 న జరిగే పోలింగ్ లో కేసీఆర్ పై తెలంగాణ ఏక పక్షంగా తన అభిమానాన్ని చాటుకోబోతోంది. మూడో సారి బీఆర్ఎస్ పార్టీని గెలిపించి, కేసీఆర్ గారిని హ్యాట్రిక్ సీఎం చేయాలని తెలంగాణ ప్రజలు మానసికంగా సిద్దమయ్యారు. ప్రచారంలో కష్ట పడ్డ బీఆర్ఎస్ శ్రేణులకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు. ఈ స్ఫూర్తిని చివరి వరకు కొనసాగించి బీఆర్ఎస్ కు భారీ విజయాన్ని అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణను సాధించి, అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపిన కేసీఆర్ ను హ్యాట్రిక్ సీఎంగా ఆశీర్వదించాలని మంత్రి హరీష్ రావు కోరారు.

Latest News

More Articles