Tuesday, May 21, 2024

35 వేల పోలింగ్ కేంద్రాలు. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమలు

spot_img

హైదరాబాద్: సైలెంట్ పీరియడ్ ప్రారంభం అయిందని, రాబోయే 48గంటల పాటు ఎలక్షన్ ప్రచారం డిస్ప్లే చేయకూడదని, ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ సీఈఓ వికాస్ రాజ్ స్పష్టం చేశారు. ఈ సమయంలో టీవీలో ఎలాంటి రాజకీయ ప్రకటనలు చేయొద్దన్నారు. అదే విధంగా బల్క్ SMS లు చేయొద్దన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి వచ్చిందన్నారు. స్థానికేతరులు సెగ్మెంట్ ను వదిలిపెట్టాలన్నారు.

Also Read.. కేసీఆర్‌ హ్యాట్రిక్ కొట్టడం పక్కా. ఓటు వేసేముందు ఒకటికి 100సార్లు ఆలోచించాలి

నగదు, మద్యం కట్టడి పై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, 48 గంటల పాటు 24 గంటలు సీసీటీవీ మానిటరింగ్ ఉంటుంది. EVM తరలించే వాహనాలకు GPS ఉంటుంది. పోలింగ్ ప్రారంభానికి 90 నిమిషాల ముందు మాక్ పోలింగ్ ఉంటుంది. పోలింగ్ సిబ్బంది ఉదయం 5.30 నిమిషాలకు వాళ్ల వాళ్ల కేంద్రాల దగ్గర ఉండాలి. EVM లను పోలింగ్ ఏజెంట్ లు ముట్టుకోవద్దు. ఫస్ట్ టైం హోం ఓటింగ్ లో 27178 మంది తమ ఓటు హక్కు వేశారు. 15990 – సీనియర్ సిటిజన్ ఉన్నారు. 1.48లక్షల మంది బ్యాలెట్ ఓట్లు వేశారు. మంగళవారం కూడా ఓటింగ్  జరుగుతుందన్నారు.

Also Read.. కొడంగల్, కామారెడ్డిలో రేవంత్ కు ఓటమి తప్పదు. కరెంట్ కావాలంటే కారుకు ఓటెయ్యాలి

27094 కేంద్రాలలో వెబ్ కాస్టింగ్.. 7571 లొకేషన్ లలో బయట కూడా వెబ్ కాస్టింగ్ ఉంటుంది. 35 వేల పోలింగ్ కేంద్రాలు, 3300 సెక్టార్ లో ఏర్పాటు, ప్రతీ సెక్టార్ కు ఒక ఇంచార్జీని నియమించాం. EVM ల తరలింపు కోసం ప్రత్యేకంగా రూట్ మ్యాప్ – ఎక్కడా ఆగకుండా వెళ్ళేలా ప్లాన్ చేశాం. ఓటర్ 12 గుర్తింపు కార్డులలో ఎదైనా చూపించి ఓటు వేయవచ్చు. పోలింగ్ కేంద్రాల వద్దకు మొబైల్ ఫోన్ అనుమతి లేదన్నారు.

ఇవ్వాల్టి వరకు 737కోట్లకు సొమ్ము సీజ్ చేసినట్లు తెలిపారు. 2018లో పోస్టల్ బ్యాలెట్ 1లక్ష మంది వేస్తే, ఈసారి 1.5 లక్షలు వేశారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉంటుందని, అయిదుగురి కంటే ఎక్కువ గుమిగుడితే కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Latest News

More Articles