Saturday, May 18, 2024

బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ పక్కా.. బీఆర్‌ఎస్‌లో చేరిన చామల ఉదయ్‌చందర్‌రెడ్డి

spot_img

హైదరాబాద్ : రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ విజయం సాధిస్తుందని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి సమక్షంలో టీపీసీసీ మాజీ సభ్యులు, ఎన్‌ఎస్‌యూఐ మాజీ జిల్లా అధ్యక్షులు చామల ఉదయ్‌ చందర్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరారు.

ఇది కూడా చదవండి.. మూడేళ్ళ బాలుడి హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఆలేరులో గులాబీ జెండా ఎగురబోతుందని తెలిపారు. మూడోసారి గొంగిడి సునీత గెలుస్తారన్నారు. గ్రామాల్లో బీఆర్‌ఎస్‌ చేసిన అభివృద్ధిపై చర్చలు పెట్టాలని సూచించారు. కాంగ్రెస్‌ పార్టీపై ప్రజలకు నమ్మకం లేదన్నారు. కాంగ్రెస్‌ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిన చామల ఉదయ్‌ చందర్‌ రెడ్డికి పార్టీ సముచిత స్థానం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Latest News

More Articles