గుజరాత్లోని దాహోద్ జిల్లాలో ఇవాళ(మంగళవారం) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. దాహోద్ జిల్లాలో దాహోద్- అలీరాజ్పూర్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. హైవేపై వెళుతున్న ఆటోను ట్రక్కు ఢీ కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ఓ చిన్నారి, మహిళ, నలుగురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. మృతులందరూ ఒకే కుటుంబానికి చెందినవారని పోలీసులు తెలిపారు.
ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ కి కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. అతన్ని సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చదవండి: అదిలాబాద్ గడ్డపై అమిత్ షా అసత్యాలు ప్రచారం చేస్తున్నారు