హైదరాబాద్: స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీసులు భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆగస్టు 15వ తేదీన ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గోల్కొండ పరిసర ప్రాంతాల్లో ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు.
రాందేవ్గూడ నుంచి గోల్కొండ కోటకు వచ్చే రోడ్డు పూర్తిగా మూసివేయనున్నారు. ఆ మార్గంలో ఏ గోల్డ్, ఏ పింక్, బీ బ్లూ పాసులు కలిగిన వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. సీ, డీ, ఈ పాసులు కలిగిన వారికి ఇతర మార్గాల నుంచి అనుమతి ఉంటుందని అధికారులు తెలిపారు.
పాసులు ఉండి సికింద్రాబాద్ నుంచి వచ్చేవారు బంజారాహిల్స్, మెహదీపట్నం, రేతిబౌలి, నాలానగర్, లంగర్ హౌస్ వంతెన, రాందేవ్గూడ మీదుగా గోల్కొండ చేరుకోవాలని సూచించారు. ఈ బ్లాక్ పాస్ కలిగిన సాధారణ ప్రజలు హుడా పార్క్లో పార్కింగ్ చేసుకొని వేడుకలకు హాజరు కావాలని ట్రాఫిక్అధికారులు తెలిపారు.