Friday, May 17, 2024

అత్తింటి వేధింపులు భరించలేక ఒకేసారి తోటికోడ‌ళ్ల ఆత్మ‌హ‌త్య

spot_img

ఏలూరు జిల్లా దుగ్గిరాల మండలం పినకడిమిలో పెను విషాదం చోటుచేసుకుంది. అత్తమామలు పెడుతున్న వేధింపులు భరించలేక.. ఇద్దరు తోడికోడళ్లు కృష్ణా నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. చిన్న కోడలు పాలపాటి స్వాతి మృతదేహం లభ్యం కాగా, పెద్ద కోడలు రూపాదేవి మృతదేహం ఇంకా లభించలేదు. నదిలో ఆమె మృతదేహం కోసం ఇంకా గాలిస్తూనే ఉన్నారు. అత్తమామలు తన కూతురిని ఎంతగానో క్షోభ పెట్టినట్లు మృతురాలి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: ఈ రోజు పిల్లలకు భోగి పండ్లు ఎందుకు పోస్తారో తెలుసా?

మృతురాలి బంధువులు అత్తమామల ఇంటిని ధ్వంసం చేసి, ఇంటి ముందు ఆందోళనకు దిగారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్నవారిని సముదాయించారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అత్తమామలు, భర్తలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

More Articles