హైదరాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి చెందారు. ఇవాళ(గురువారం) తెల్లవారుజామున 4గంటలకు నగరంలోని మహంకాళి పోలీస్ స్టేషన్ ఏరియాలో ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై బోయిన్ పల్లి నుండి రాణిగంజ్ వైపు వెళ్తుండగా ఎంజీ రోడ్డులోని ఆజాం హోటల్ ఎదురుగా సంఘటన జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల చేపట్టారు. మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
More News..