రాష్ట్రంలో ప్రఖ్యాతి గాంచిన బాలాపూర్ గణేష్ లడ్డూ మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. గత రికార్డులను బ్రేక్ చేస్తూ.. ఈ సారి రికార్డు స్థాయిలో రూ. 27 లక్షలు పలికింది. తుర్కయాంజల్కు చెందిన దాసరి దయానంద్ రెడ్డి బహిరంగ వేలంపాటలో బాలాపూర్ గణేష్ లడ్డును దక్కించుకున్నారు. గత ఏడాది రూ. 24.60 లక్షలు పలికిన లడ్డూ.. ఈ ఏడాది అత్యధికంగా రూ. 27 లక్షలకు చేరుకుంది. కాగా ఈ లడ్డు కోసం 36 మంది స్థానికులు, స్థానికేతరులు పోటీ పడటం గమనార్హం.
Read Also: గణేష్ నిమజ్జనం సందర్భంగా గుడ్న్యూస్ చెప్పిన మెట్రో
బాలాపూర్ గణేశుడి ఊరేగింపు తర్వాత గ్రామంలోని బొడ్రాయి వద్ద వేలం పాట నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి పాల్గొన్నారు. లడ్డూవేలం తిలకించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. కాగా, వేలంపాటలో లడ్డు గెలుపొందినవారు స్థానికులైతే మరుసటి ఏడాది, స్థానికేతరులైతే అప్పటికప్పుడు డబ్బు చెల్లించేలా నిబంధన విధించారు.