Friday, May 3, 2024

హైదరాబాద్‎లో రూ.1.26 కోట్లు పలికిన గణేష్ లడ్డూ

spot_img

రాష్ట్రవ్యాప్తంగా గణేషుడి నిమజ్జనాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. భక్తుల కోలాటాలు, డ్యాన్సులతో ఆ లంబోదరుడిని నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు. కాగా.. ఏ గణేషుడి నిమజ్జనానికైనా ముందుగా లడ్డూ వేలంపాట ఆనవాయితీగా వస్తోంది. గణపతి ప్రసాదాన్ని పొందేందుకు భక్తులు పోటీ పడుతున్నారు. ఇందుకోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు వెనుకాడడం లేదు. తాజాగా హైదరాబాద్‌లోని బండ్లగూడలోని కీర్తి రిచ్‌మండ్ విల్లాలో గణపతి లడ్డూ రికార్డు స్థాయిలో ధర పలికింది. గతంలో ఎన్నడూ లేని విధంగా.. గణపతి లడ్డూ రూ. కోటి 26 లక్షలు పలికి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ విధంగా భారీ ధర పలకడం ఇక్కడ ఇదే మొదటి సారి కావడం గమనార్హం. గతేడాది ఇక్కడ గణపతి లడ్డూ రూ. 60.80 లక్షలు పలికింది. కాగా.. ఈ సారి మాత్రం రెట్టింపు ధర పలికింది. 2021లో కూడా ఇక్కడ గణపతి లడ్డూ రూ. 41 లక్షలు పలికింది.

ప్రముఖ ప్రఖ్యాతి గాంచిన బాలాపూర్ గణేష్ మహారాజ్ లడ్డు ధర 2023 లో రికార్డు స్థాయిలో 27 లక్షలు పలికింది. దాసరి దయానంద్ రెడ్డి అనే వ్యక్తి బహిరంగ వేలంపాటలో బాలాపూర్ గణేష్ లడ్డును 27 లక్షల రూపాయలకు దక్కించుకున్నారు. గత ఏడాది 24.60 లక్షలు పలికిన లడ్డు ధర ఈ ఏడాది అత్యధికంగా 27 లక్షలకు చేరుకుంది. కాగా ఈ లడ్డు కోసం 36 మంది స్థానికులు, స్థానికేతరులు పోటీ పడ్డారు.

మరిన్ని వార్తలు..

Latest News

More Articles