Friday, May 3, 2024

గణేష్ నిమజ్జనం సందర్భంగా గుడ్‎న్యూస్ చెప్పిన మెట్రో

spot_img

రాష్ట్రవ్యాప్తంగా గణేషుడి నిమజ్జనాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. భక్తుల కోలాటాలు, డ్యాన్సులతో ఆ లంబోదరుడిని నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు. కాగా.. ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం చూడటానికి భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. వారి కోసం హైద్రాబాద్ మెట్రో ఓ ప్రకటన చేసింది. వినాయక నిమజ్జనాన్ని మరింత ఉత్సాహంతో జరుపుకునే విధంగా ఎల్అండ్ టీ మెట్రో రైల్ ఏర్పాట్లు చేసింది. మెట్రో రైలు సమయాల్లో మార్పులు చేసింది. ఉదయం 6 గంటల నుండి రాత్రి ఒంటిగంట వరకు మెట్రో రైళ్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. చివరి మెట్రో రైల్ సంబంధిత స్టేషన్ల నుంచి ఒంటిగంటకు బయలుదేరి రెండు గంటల వరకు చివరి స్టేషన్‎కు చేరుకుంటుంది. అనంతరం 29న రోజూ మాదిరిగానే ఉదయం 6 గంటల నుంచి మెట్రో సర్వీస్‎లు ప్రారంభమవుతాయని తెలిపింది.

Read Also: హైదరాబాద్‎లో రూ. 1.26 కోట్లు పలికిన గణేష్ లడ్డూ

Latest News

More Articles