Friday, May 3, 2024

బాలాపూర్ లడ్డూ తొలి వేలం కేవలం రూ.450.. 30ఏళ్లుగా ఎవరెవరు దక్కించుకున్నారంటే?

spot_img

రాష్ట్రంలో ప్రఖ్యాతిగాంచిన బాలాపూర్ గణేష్ లడ్డూ మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. గత రికార్డులను బ్రేక్ చేస్తూ.. ఈ సారి రికార్డు స్థాయిలో రూ.27 లక్షలు పలికింది. తుర్కయాంజల్‏కు చెందిన దాసరి దయానంద్ రెడ్డి బహిరంగ వేలంపాటలో బాలాపూర్ గణేష్ లడ్డును దక్కించుకున్నారు. గత ఏడాది రూ. 24.60 లక్షలు పలికిన లడ్డూ.. ఈ ఏడాది అత్యధికంగా రూ. 27 లక్షలకు చేరుకుంది. కాగా ఈ లడ్డు కోసం 36 మంది స్థానికులు, స్థానికేతరులు పోటీ పడటం గమనార్హం.

Read Also: రికార్డు ధర పలకిన బాలాపూర్ గణేష్ లడ్డూ.. డబ్బు చెల్లింపులో కొత్త నిబంధన

1980లో బాలాపూర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి ఏర్పాటయింది. 1994లో లడ్డూ వేలం ప్రారంభమైంది. తొలి ఏడాది రూ.450 పలికిన లడ్డూ.. 2017లో రూ.15 లక్షలు దాటింది. తొలిసారిగా 2020లో కరోనా కారణంగా బాలాపూర్‌ లడ్డూ వేలంపాట రద్దయింది. గ్రామాభివృద్ధి కోసం మొదలుపెట్టిన బాలాపూర్‌ లడ్డూ వేలం పాట గణనాథుడి కటాక్షంతో నిర్విఘ్నంగా కొనసాగుతున్నది. లడ్డూ దక్కించుకున్న వారి ఇంట్లో సిరిసంపదలతోపాటు వ్యాపార పరంగా బాగా కలిసి వస్తుండటంతో ప్రతి ఏటా ఇక్కడ తీవ్రమైన పోటీ నెలకొంటున్నది. వేలం పాట ద్వారా వచ్చిన డబ్బును ఉత్సవ కమిటీ.. గ్రామాభివృద్ధి కోసం ఖర్చు చేస్తున్నది. ఇప్పటి వరకు రూ.1,04,97,970 ఖర్చు చేసినట్లు ఉత్సవ కమిటి తెలిపింది.

Read Also: హైదరాబాద్‎లో రూ. 1.26 కోట్లు పలికిన గణేష్ లడ్డూ

ఏ ఏడాది లడ్డూ ఎవరు దక్కించుకున్నారంటే..

1994లో కొలన్ మోహన్‌రెడ్డి- రూ.450

1995లో కొలన్ మోహన్‌రెడ్డి- రూ.4,500

1996లో కొలన్ కృష్ణారెడ్డి- రూ.18 వేలు

1997లో కొలన్ కృష్ణారెడ్డి- రూ.28 వేలు

1998లో కొలన్‌ మోహన్‌ రెడ్డి- రూ.51 వేలు

1999 కళ్లెం ప్రతాప్‌ రెడ్డి- రూ.65 వేలు

2000 కొలన్‌ అంజిరెడ్డి- రూ.66 వేలు

2001 జీ. రఘనందన్‌ రెడ్డి- రూ.85 వేలు

2002లో కందాడ మాధవరెడ్డి- రూ.1,05,000

2003లో చిగిరినాథ బాల్‌ రెడ్డి- రూ.1,55,000

2004లో కొలన్‌ మోహన్‌ రెడ్డి- రూ.2,01,000

2005లో ఇబ్రహీ శేఖర్‌- రూ.2,08,000

2006లో చిగురింత తిరుపతి- రెడ్డి రూ.3 లక్షలు

2007లో జీ రఘనాథమ్‌ చారి- రూ.4,15000

2008లో కొలన్‌ మోహన్‌ రెడ్డి- రూ.5,07,000

2009లో సరిత- రూ.5,10,000

2010లో కొడాలి శ్రీదర్‌ బాబు- రూ.5,35,000

2011లో కొలన్‌ బ్రదర్స్‌- రూ.5,45,000

2012లో పన్నాల గోవర్ధన్‌ రెడ్డి- రూ.7,50,000

2013లో తీగల కృష్ణారెడ్డి- రూ.9,26,000

2014లో సింగిరెడ్డి జైహింద్‌ రెడ్డి- రూ.9,50,000

2015లో కొలన్‌ మధన్‌ మోహన్‌ రెడ్డి- రూ.10,32,000

2016లో స్కైలాబ్‌ రెడ్డి- రూ.14,65,000

2017లో నాగం తిరుపతి రెడ్డి- రూ.15 లక్షల 60 వేలు

2018లో తేరేటి శ్రీనివాస్‌ గుప్తా- రూ.16,60,000

2019లో కొలన్ రామిరెడ్డి- రూ.17 లక్షల 60 వేలు

2020లో కరోనా కారణంగా లడ్డూ వేలం పాట రద్దు

2021లో మర్రి శశాంక్‌ రెడ్డి, ఏపీ ఎమ్మెల్సీ రమేశ్‌ యాదవ్‌- రూ.18.90 లక్షలు

2022లో వంగేటి లక్ష్మారెడ్డి- రూ.24,60,000

2023లో దాసరి దయానంద్ రెడ్డి – రూ. 27 ల‌క్ష‌లు

Read Also: గణేష్ నిమజ్జనం సందర్భంగా గుడ్‎న్యూస్ చెప్పిన మెట్రో

Latest News

More Articles