Saturday, May 4, 2024

హైదరాబాద్ లో దారుణం..మహిళపై ఇద్దరు యువకులు..!

spot_img

హైదరాబాద్ లో అమానుషం నెలకొంది. చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవించే ఓ మహిళ..తెల్లవారుజామున ఇద్దరు యువకులకు కనిపించింది. ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఫలితంగా అధిక రక్తస్రావంతో ఆమె ఘటన స్థలంలోనే మరణించింది. ఈ ఘటన కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున 4.30 సమయంలో జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం..హైదరాబాద్ లోని మూసాపేట వై జంక్షన్ సమీపంలోని విష్ణుప్రియ లాడ్జి పక్కనున్న భవనంలో వ్యాపార దుకాణాలు ఉన్నాయి. ఆదివారం ఉదయం భవనం సెల్లార్ లోని ఒక షట్టర్ వద్ద గుర్తుతెలియన మహిళ శవాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారంఅదించారు.

దీంతో ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు మ్రుతురాలి ఒంటిపై దుస్తులు అస్తవ్యస్తంగా ఉండటంతోపాటు తీవ్రస్థాయిలో రక్తస్రావమైనట్లు గుర్తించారు. అంతేకాదు డేడ్ బాడి పక్కన ఓ సంచిలో దొరికిన చీటీపై రాసి ఉన్న పేరు ఆమెదే కావొచ్చని పోలీసులు భావిస్తున్నారు. సంచిలో చిత్తు కాగితాలు ఉండటంతో ఆమె వాటిని ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. పాతికేళ్ల వయస్సున్న ఇద్దరు యువకులు ఘటన జరిగిన భవనం పక్కన ఉన్న గల్లీలో కొన్ని నిమిషాలు ఆమెతో మాట్లాడటం కనిపించింది. తర్వాత ఆమెను బలవంతంగా సెల్లార్ లోని షట్టర్ వద్దకు తీసుకెళ్లారు. కాసేపటి తర్వాత ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై కూకట్ పల్లి వైపు పారిపోయినట్లు రికార్డు అయ్యింది. వేలిముద్రల నిపుణులు, జాగిలాల బ్రుందం సభ్యులు పలు ఆధారాలను సేకరించారు. కూకట్ పల్లి ఏసీపీ కె.శ్రీనివాసరావు, సీఐ క్రుష్ణమోహన్ లుఘటనాస్థలాన్ని పరిశీలించి మహిళ డెడ్ బాడీని ఆసుపత్రికి తరలించారు. నిందితులకోసం ప్రత్యేక బ్రుందాలతో గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతాయుతంగా మాట్లాడాలి

Latest News

More Articles