Thursday, May 9, 2024

సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతాయుతంగా మాట్లాడాలి

spot_img

ఎన్నికల వేళ ఏమైనా మాట్లాడతామంటే సరికాదని బీజేపీ నేత రఘునందన్ రావు అన్నారు. తెలంగాణకు హాని చేసే వారు ఎవరైనా సరే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ముదిరాజ్ లకు రేవంత్ రెడ్డి ఏం హామీలు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతాయుతంగా మాట్లాడాలని అన్నారు.

కేరళలో ఎన్నికల ప్రచారానికి వెళ్లి కమ్యూనిస్టులను విమర్శించిన రేవంత్ రెడ్డి, తెలంగాణకు రాగానే కమ్యూనిస్టులను పొగుడుతున్నారన్నారు రఘునందన్ రావు. ఆయన ఏం మాట్లాడతారో ఆయనకే అర్థం కావడంలేదని విమర్శించారు. ఆదిలాబాద్ లో మోడీని పెద్దన్న అన్నది రేవంత్ రెడ్డేనని తెలిపారు. అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయినా హామీలు అమలు జరగలేదని అన్నారు. సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల రుణమాఫీకి, ఆగస్టు నెలకు సంబంధం ఏంటని ప్రశ్నించారు.

దానం నాగేందర్ గత ప్రభుత్వంలో పదేళ్ల పాటు పదవి అనుభవించారని, బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్లారని విమర్శించారు. తెలంగాణలో ఈసారి 10 కంటే ఎక్కువ లోక్ సభ సీట్లు గెలుస్తామని రఘునందన్ రావు ధీమా వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి:  కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి హోల్ సేల్ గా అమ్మేస్తారు

Latest News

More Articles