సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి తనకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ఆరోపించారు. రేవంత్ కొంత మంది నాయకుల దగ్గరకు వెళ్లి.. తన స్థాయిని దిగజార్చుకుంటున్నారని అన్నారు. రేవంత్ తో చాలా విషయాలు మాట్లాడాలని. అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వడం లేదన్నారు. తక్కువ టైమ్లో సీఎం అయింది రేవంత్ రెడ్డి ఒక్కరే అని విహెచ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించింది కూడా ఆయనే అని స్పష్టం చేశారు.
అయితే.. తాజాగా జరుగుతున్న పరిణామాలను చూసి కాంగ్రెస్ కార్యకర్తలు బాధపడుతున్నారని అన్నారు వీహెచ్. కాంగ్రెస్ క్యాడర్కు న్యాయం చేయకుండా.. పార్టీలు మారి వస్తున్నవారికి రేవంత్ ప్రాధాన్యత ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి ఒక్క సైడ్ వినకుండా రెండు సైడ్స్ వినాలని కోరుతున్నానని అన్నారు. పార్టీ కార్యకర్తలలకు అన్యాయo చేయకండి అని అన్నారు. తాను రేవంత్ రెడ్డికి వ్యతిరేకం కాదని హనుమంతరావు స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేసి ప్రజలు బాధ పడుతున్నారు