హైదరాబాద్: ప్రముఖ సినీ మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థం శుక్రవారం సాయంత్రం వేడుకగా జరిగింది. హైదరాబాద్లోని నాగబాబు నివాసంలో జరిగిన ఈ వేడుకలో ఇరు కుటుంబాలకు సంబంధించిన పెద్దలు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోషల్మీడియాలో #VarunLav హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
2017లో విడుదలైన ‘మిస్టర్’ కోసం వరుణ్ – లావణ్య తొలిసారి కలిసి పనిచేసిన సమయంలోనే వీరిమధ్య స్నేహం కుదిరింది. 2018లో వీరిద్దరి కాంబినేషన్లో ‘అంతరిక్షం’ చేస్తున్నప్పుడు స్నేహం ప్రేమగా మారినట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్ నటిస్తున్న ‘గాండీవధారి అర్జున’ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది. లావణ్య ప్రస్తుతం కోలీవుడ్లో ఓ సినిమా చేస్తున్నారు.