హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా 53 మంది పోలీసు అధికారులకు తెలంగాణ ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. అదనపు ఎస్పీలుగా విధులు చేపడుతున్న 18 మందికి ఎస్పీలుగా, మరో 35 మంది డీఎస్పీలకు అదనపు ఎస్పీలుగా పదోన్నతి కల్పించింది.
ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి పొందిన అధికారులు డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలన్నారు. 15 రోజుల్లోగా నూతన విధుల్లో చేరాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.