ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా ‘గాండీవధారి అర్జున’ అనే యాక్షన్ థ్రిల్లర్ రూపొందుతుంది. ఈ సినిమాలో వరుణ్ కు జంటగా సాక్షి వైద్య కనిపించనుంది.
ఆగస్టు 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన యాక్షన్ ట్రైలర్ను రామ్చరణ్ విడుదల చేశారు. జెమ్స్ బాండ్ సినిమాను తలపించేలా యాక్షన్ ట్రైలర్ ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
తనని నమ్ముకున్న వాళ్లకి రక్షణగా నిలుస్తూ ప్రాణాల్ని కాపాడటం కోసం ఓ సెక్యూరిటీ ఆఫీసర్ ఏం చేశాడన్న విషయం చుట్టు కథను అల్లుకున్నట్లు తెలుస్తోంది.