Friday, May 17, 2024

జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతితో కమిటా? దక్షిణాదికి చెందిన వారు ఎందుకు లేరు?

spot_img

హైదరాబాద్: జమిలి ఎన్నికలపై అధ్యయనంకు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్ తో కమిటీ వేయడం ఆశ్చర్యకరమని BRS  సీనియర్ నేత , రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. కమిటీలో అంతా ఉత్తర భారత దేశ సభ్యులు మాత్రమే ఉన్నారనీ.. దక్షిణ భారత దేశం నుంచి ఒక్కరూ కూడా లేకపోవడం శోచనీయమన్నారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు పెట్టీ ప్రధాని మోడీ దేశాన్ని గందరగోళ పరిస్థితులోకి నెట్టారని బోయినపల్లి వినోద్ కుమార్ ఫైర్ అయ్యారు. NDA సర్కార్ పదేళ్లుగా మాట్లాడకుండా ఇప్పుడు హడావుడిగా పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయడాన్ని వినోద్ కుమార్ తప్పుబట్టారు.

Telangana తెలంగాణ సాగునీటి రంగంలో ఆవిష్కృతమైన మరోఘట్టం..!!

2018లోనే జమిలి ఎన్నికలపై BRS  అభిప్రాయం చెప్పామని గుర్తు చేశారు వినోద్ కుమార్. జమిలి ఎన్నికలు మంచిదే కానీ.. చర్చ జరగాలని లా కమిషన్ కు స్పష్టం చేశామని అన్నారు. మోడీ కి తప్ప.. బిజెపిలో ఉన్న వారికి కూడా ఏమి జరుగుతుందో తెలియడం లేదనీ వినోద్ కుమార్ అన్నారు. జమిలి ఎన్నికలపై ఇప్పటికే రిపోర్ట్ రెడీ అయ్యి ఉందా ? ఇప్పుడు వేసిన కమిటీ నామ్ కే వాస్తే కమిటా అన్న అనుమానం తనకు ఉందన్నారు.

మోడీ దేశం ను ఎటువైపు తీసుకెళ్తున్నారు అర్థం కావడం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేసారు . ఏపీ విభజన చట్టంలో రెండు రాష్ట్రాల అసెంబ్లీ లలో శాసన సభ లో సభ్యుల సంఖ్య పెంచాలని ఉంది.. కానీ మోడీ సర్కార్ పట్టించుకోలేదని గుర్తు చేశారు. ఇక చిన్న సవరణతో తెలుగు రాష్ట్ర ల అసెంబ్లీ లలో సభ్యుల సంఖ్య పెంచవచ్చని కానీ .. ఆ విషయం ను మోడీ సర్కార్ ఇప్పటి వరకు పెట్టించుకొలేదని విమర్శించారు.

Chandramukhi 2 భయపెడుతున్న ‘చంద్రముఖి-2’ ట్రైలర్..!!

జమిలి ఎన్నికలకు 5 రాజ్యాంగ సవరణలు అవసరం ఉన్న ముందుకు వెళుతున్నారు కానీ.. విభజన చట్టంలో ఉన్న ఈ అంశంపై మాత్రం ఎందుకు దృష్టి పెట్టలేదని మోడీని ప్రశ్నించారు వినోద్ కుమార్.  ఇక మహిళ రిజర్వేషన్ల బిల్లు విషయంలో పదేళ్లు మోడీ సర్కార్ చొరవ ఎందుకు తీసుకోలేదని అడిగారు.  ఎన్నికల కోసం గందరగోల పరిస్థితి బిజెపి ప్రభుత్వం దేశంలో సృష్టిస్తుంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జమిలి ఎన్నికల అంశం .. తాజా పరిణామాలపై BRS లో చర్చిస్తాం అని స్పష్టం చేశారు బోయినపల్లి వినోద్ కుమార్.

Latest News

More Articles