Sunday, May 19, 2024

సచిన్‌ రికార్డును సమం చేసిన విరాట్.. సఫారీ ముందు భారీ టార్గెట్

spot_img

న్యూఢిల్లీ: భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్ కోహ్లీ వన్డేల్లో 49వ సెంచరీని కొట్టాడు. దీంతో అంతర్జాతీయ కెరీర్‌లో సచిన్‌ టెండూల్కర్ వన్డే సెంచరీల రికార్డును సమం చేశాడు. దక్షిణాఫ్రికాపై విరాట్ 119 బంతుల్లో 100 పరుగులు సాధించి ఈ ఘనతను నమోదు చేశారు.  సచిన్‌ 452 ఇన్నింగ్స్‌ల్లో 49 సెంచరీలు చేయగా.. విరాట్ కేవలం 277 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనతను అందుకోవడం విశేషం. మొత్తంగా కొహ్లీ కెరీర్ లో 79వ సెంచరీ ఇది.

ఆదివారం 35వ పుట్టినరోజు జరుపుకుంటున్న బర్త్‌ డే బాయ్‌ విరాట్‌ కోహ్లీ సెంచరీ (101 నాటౌట్‌) చేశాడు.  శ్రేయస్‌ అయ్యర్‌ (77), రోహిత్‌ శర్మ (40), మెరుపులతో భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. దీంతో సఫారీల ముందు 327 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

Also Read.. కోహ్లీకి వెరైటీగా అనుష్క విషెస్‌.. పోస్ట్ వైరల్

 

Latest News

More Articles