క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీ నేడు 35వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా విరాట్కు మాజీ క్రికెటర్లు, సెలబ్రిటీలు, ఫ్యాన్స్ బర్త్డే విషెస్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కోహ్లీ సతీమణి అనుష్క ఓ స్పెషల్ మెసేజ్ను పోస్ట్ చేశారు. ఆ మెసేజ్ ఫ్యాన్స్ను ఆకట్టుకుంటోంది.
Also Read.. రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ ఏజెంట్
ప్రపంచకప్లో దక్షిణాఫ్రికాతో కీలక మ్యాచ్ కూడా నేడు జరగనుండటంతో సచిన్ శతకాల రికార్డును అతడు సమం చేస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇక ఆసక్తికర గణాంకాలతో ఉన్న. ఒక్క అధికారికమైన బంతిని కూడా విసరకుండానే అంతర్జాతీయ క్రికెట్లో వికెట్ సాధించిన బౌలర్గా కోహ్లీ నిలిచాడు. దీనికి సంబంధించిన ఫొటోను అనుష్క అభిమానులతో పంచుకొంది. గంట వ్యవధిలోనే ఈ పోస్టును 14 లక్షల మందికిపైగా లైక్ చేశారు.
Also Read.. డోప్ పరీక్షలో దొరికిన ఒలింపిక్ విజేత
2011లో టీ20ల్లో కోహ్లీ బౌలింగ్ చేశాడు. ఇంగ్లాండ్ ఆటగాడు కెవిన్ పీటర్సన్కు తొలి బంతి విసరగా.. దానిని అతడు ముందుకొచ్చి కొట్టేందుకు ప్రయత్నించాడు. బాల్ అతడికి అందకుండా వైడ్ వెళ్లడంతో ధోనీ మెరుపు వేగంతో అందుకొని స్టంప్స్ అవుట్ చేశాడు. దీంతో 0.0-0-1-1గా గణంకాలు నమోదయ్యాయి. దీనిని అనుష్క షేర్ చేసింది. ‘అతడు జీవితంలో ప్రతి పాత్రలో అసాధారణ ప్రతిభ కనబర్చాడు. ఇంకా ఎన్నో ఘనతలు సాధించాలి. ఎన్నటికీ.. ఎలాఉన్నా ప్రేమిస్తూనే ఉంటాను.’ అని రాసుకొచ్చింది.