Friday, May 10, 2024

రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ ఏజెంట్

spot_img

కామారెడ్డి: కామారెడ్డి నియోజకవర్గంలో ఉన్న ముస్లిం, మైనార్టీలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించి కారు గుర్తుకు ఓటు వేయాలని హోం మంత్రి మహమూద్ అలీ కోరారు. కామారెడ్డిలో నిర్వహించిన మైనార్టీ ఆత్మీయ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. అన్ని వర్గాల సంక్షేమం కొరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

Also Read.. డోప్ ప‌రీక్ష‌లో దొరికిన ఒలింపిక్ విజేత

సమైక్య ఆంధ్రప్రదేశ్ లో అనేకమంది ముఖ్యమంత్రిలు మారారు, కానీ సీఎం కేసీఆర్ ల ఎవ్వరు ఆలోచించలేదు. మైనార్టీల కొరకు గురుకులాలు నిర్మించి మైనార్టీల విద్యను ప్రోత్సహించారు. సీఎం కేసీఆర్ హయాంలో మైనార్టీలు అన్ని విధాలుగా అభివృద్ధిని సాధించారు. స్వతంత్ర భారత చరిత్రలో ఇప్పుడిప్పుడే మైనారిటీలు అభివృద్ధి సాధిస్తున్నారు. మంచి చేసే నాయకుడిని వదులుకోవద్దని పిలుపునిచ్చారు.

Also Read.. అభ్యర్థి గుణగణాలు, పార్టీ చరిత్రను చూసి ఓటు వేయాలి

రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ ఏజెంట్. ఆర్ఎస్ఎస్ పంపిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆర్ఎస్ఎస్ లో గతంలో పనిచేశాడు. అతనికి ముస్లింలు అంటే పడదు. ఓటుకు నోటు కేసులో కేసులు ఎదుర్కొంటున్నాడు. అలాంటి వారిని మనం ఎన్నుకోవడం కరెక్ట్ కాదు. కామారెడ్డి ప్రజల ఆలోచించి,గత తొమ్మిదేళ్ల కాలంలో తెలంగాణను అన్ని రంగాల్లో నెంబర్ వన్ చేసి సీఎం కేసీఆర్ ను మూడో సారి ముఖ్యమంత్రి చేసుకోవాలని పిలుపునిచ్చారు.

Latest News

More Articles