హైదరాబాద్: గాంధీభవన్ ముందు విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు నిరసన చేపట్టారు. గాంధీభవన్ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టికెట్లు అమ్ముకున్నాడు అంటూ ఆరోపించారు.
Also Read.. బీజేపీకి బాబూమోహన్ రాజీనామా!
దీంతో గాంధీభవన్ లోపలి గేట్లను గాంధీ భవన్ సిబ్బంది మూసేసారు. గాంధీభవన్ లో కాంగ్రెస్ జెండాలను తగులబెట్టారు విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు. ఇటుకలు రాళ్లు రువ్వి నిరసన వ్యక్తం చేసారు. రేవంత్ రెడ్డి ప్లెక్సీపై, గాంధీభవన్ పై విష్ణు అనుచరులు రాళ్లు రువ్వారు.