పెద్దపల్లి జిల్లా: తెలంగాణలో సిఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ది, సంక్షేమం చూసి ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్ లోకి భారీగా చేరుతున్నారని సంక్షేమ శాఖ మంత్రి, ధర్మపురి బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక, ఎర్రగుంట్ల పల్లె, గ్రామాలకు చెందిన 300 మంది ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆయన ఆహ్వానించారు.
Also Read.. ఆర్ఎస్ఎస్ చెప్పు చేతుల్లో కాంగ్రెస్ పార్టీ.. కాంగ్రెస్ కు మైనారిటీ ఛైర్మన్ రాజీనామా
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ….. సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ లాంటి రాష్ట్రం లేదని అన్నారు. వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయంటే కేసీఆరే పాలనే అని చెప్పారు. 60 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ ఎన్నడూ రైతుల గురించి ఆలోచించలేదని, మంచి నీళ్ళు ఇచ్చే జ్ఞానం కాంగ్రెస్ కు లేదని అన్నారు. తెలంగాణ వచ్చాకే ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ కు పట్ట కడతారని ఆయన అన్నారు.