Sunday, May 19, 2024

తెలంగాణ వ్యాప్తంగా మొదలైన ఓట్ల లెక్కింపు.. మొదట పోస్టల్ బ్యాలెట్లు

spot_img

తెలంగాణ, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. మిజోరాంలో కౌంటింగ్ రేపు సోమవారం చేపట్టనున్నారు. అయితే మిగతా నాలుగు రాష్ట్రాల్లో కౌంటింగ్ కోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. తెలంగాణవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు మొదలైంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తున్నారు. మొత్తం 2.20 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. వీటి అనంతరం ఈవీఎం ఓట్లు లెక్కించనున్నారు. ఓట్ల లెక్కింపు కోసం 49 కేంద్రాలను ఏర్పాటుచేశారు.

Latest News

More Articles