ప్రేమికులకు, ప్రేమకు సాయం చేయనివారుండరు. ప్రేమించుకున్న తర్వాత పెళ్లి కోసం పెద్దలను ఒప్పించడానికి నానాతంటాలు పడుతుంటారు. వారు ఒప్పుకుంటే సరే, ఒప్పుకోకపోతే.. ప్రేమ పెళ్లి చేసుకుంటారు. ఇలాగే ఓ జంట తమ పెద్దలను కాదని లవ్ మ్యారేజ్ చేసుకుంది. అది కూడా ఎక్కడో తెలుసా?
Read Also: తెలంగాణ వ్యాప్తంగా మొదలైన ఓట్ల లెక్కింపు.. మొదట పోస్టల్ బ్యాలెట్లు
వెస్ట్ బెంగాల్కు చెందిన ఓ జంట.. తమ పెళ్లి కోసం జార్ఖండ్ వెళ్లే రైలు ఎక్కింది. రైలు కాస్త దూరం వెళ్లగానే.. కదులుతున్న రైలులో ప్రయాణికుల సాక్షిగా వివాహ బంధంతో ఒక్కటైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ముందుగా వీడియోలో యువతి ప్రియుడికి ఏదో చెప్తూ కనిపిస్తుంది. ఆ తర్వాత అతడు యువతి మెడలో మూడు ముళ్లు వేస్తాడు. ఆ తర్వాత ఇద్దరూ దండలు మార్చుకుంటారు. ఆ సమయంలో రైల్లోని తోటి ప్రయాణికులంతా వారి చుట్టూ చేరి ఈ తతంగాన్నంతా వీక్షిస్తుంటారు. అక్కడే ఉన్న కొందరు ఈ ఘటనను తమ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అదికాస్తా ప్రస్తుతం వైరల్గా మారింది.
https://www.instagram.com/p/C0EBdKJru_P/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again