కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల తనయుడు వైఎస్ రాజారెడ్డి వివాహం ఫిబ్రవరి 17న జరగనుంది. నిశ్చితార్థం వేడుక జనవరి 18న జరగనుంది. ఈ మేరకు వైఎస్ షర్మిల వివాహ సన్నాహాలను ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లోని పలువురు రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలను పెళ్లికి ఆహ్వానిస్తున్నారు.
దీనిలో భాగంగా ఇటీవలే తన అన్న, ఏపీ సీఎం వైఎస్ జగన్, మంత్రి హరీష్ రావు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, గవర్నర్ తమిళిసై తదితరులను ఇప్పటికే ఆహ్వానించారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కూడా వైఎస్ షర్మిల ఆహ్వానించారు.
హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన వైఎస్ షర్మిల.. కుమారుడు రాజారెడ్డి వివాహానికి రావాలంటూ ఆహ్వానించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్తో తనకు ఉన్న అనుబంధాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల చెప్పారు.
ఈ సమావేశంలో రాజకీయాలపై చర్చించలేదన్నారు. ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూడటం సరికాదన్నారు షర్మిల. అంతేకాకుండా.. షర్మిల పలువురు ప్రతిపక్ష నేతలకు కూడా ఆహ్వానించనున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కూడా ఆహ్వానించే అవకాశం ఉందని తెలుస్తోంది..