హైదరాబాద్: వరల్డ్ కప్ 2023 సందర్భంగా ఈరోజు, రేపు విదేశీ ఆటగాళ్లు హైదరాబాద్ చేరుకోనున్నారు. ఉప్పల్ వేదికగా 5 వరల్డ్ కప్ మ్యాచులు జరగనున్నాయి. ఇందులో రెండు వార్మ్ అప్ మ్యాచులు ఉండగా.. మూడు ప్రధాన మ్యాచులు ఉన్నాయి. ఈ సందర్భంగా ఐటీసీ కాకతీయలో న్యూజీలాండ్ జట్టు, పార్క్ హయత్ లో పాకిస్థాన్, తాజ్ కృష్ణాలో ఆస్ట్రేలియా, తాజ్ బంజారాలో నెదర్లాండ్, శంషాబాద్ నోవొటెల్ లో శ్రీలంక జట్టు బస చేయనున్నాయి.
మ్యాచుల వివరాలు:
సెప్టెంబర్ 29: పాకిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్ (వార్మప్ మ్యాచ్)
అక్టోబర్ 3: పాకిస్థాన్ వర్సెస్ ఆస్ట్రేలియా (వార్మప్ మ్యాచ్)
అక్టోబర్ 6: పాకిస్థాన్ వర్సెస్ నెదర్లాండ్
అక్టోబర్ 9: న్యూజిలాండ్ వర్సెస్ నెదర్లాండ్
అక్టోబర్ 10: పాకిస్థాన్ వర్సెస్ శ్రీలంక
More News…