హైదరాబాద్: పాతబస్తీ ఫలక్ నుమాలో 5ఏండ్ల బాలుడు అయాన్ కిడ్నాప్ కు గురయ్యాడు. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిని అగంతకుడు కిడ్నాప్ చేసాడు. బాలుడి తండ్రి ఫలక్ నుమా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంటి నుండి నడుచుకుంటూ వస్తున్న బాలుడుని ఓ వ్యక్తి తీసుకోని వెళ్తునట్టు సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. కిడ్నాపర్ కోసం ఐదు బృందాలు గాలిస్తున్నాయని పోలీసులు తెలిపారు. ఈరోజు ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఓ బాలుడిని గుర్తుతెలియని వ్యక్తి కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే.
Also Read.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఐదేళ్ల బాబు కిడ్నాప్